కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీ
మన భారత్ , ఆంధ్ర ప్రదేశ్: చీపురుపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కొండపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని వినాయక కాలనీ వాసులు తమ కాలనీలో గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న తీవ్ర లోవోల్టేజ్ సమస్యను ఎమ్మెల్యేకు వివరించారు. కాలనీలో సరైన విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా గృహోపకరణాలు తరచూ పాడవుతున్నాయని వాపోయారు. కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం వినాయక కాలనీ...