కోట్ల విలువైన ప్రభుత్వ భూమి గుర్తింపు..
మన భారత్, విజయనగరం: విజయనగరం జిల్లా బొండపల్లి మండలం అంబటవలస గ్రామంలో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు గుర్తించి సంరక్షణ చర్యలు చేపట్టారు. ప్రభుత్వానికి చెందిన భూమిలో అక్రమ ఆక్రమణలు జరుగుతున్నాయనే సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు భూమిని పరిశీలించి, అక్కడ ఉన్న మామిడి తోటతో పాటు భవనాన్ని గుర్తించారు. ప్రభుత్వ భూమిపై ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ముందస్తు చర్యగా అధికారులు మామిడి చెట్లు, టేకు మొక్కలకు ప్రత్యేక నెంబర్లు వేశారు....