త్వరలో “లైవ్నెస్ ధృవీకరణ”కు శ్రీకారం
మన భారత్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం (SERP) ఆధ్వర్యంలో అందిస్తున్న చెయ్యూత సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో పారదర్శకత పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్లు నిజమైన లబ్ధిదారులకే చేరేలా, మరణించిన వ్యక్తుల పేర్లపై జరుగుతున్న అనధికారిక చెల్లింపులను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం “లైవ్నెస్ ధృవీకరణ” విధానాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు SERP తెలంగాణ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డి. దివ్య, ఐఏఎస్ ప్రత్యేక సర్క్యులర్ జారీ చేశారు. ప్రస్తుతం...