అలెర్ట్.. ఆ సమయంలో బయటకు రావద్దు
45 డిగ్రీలు దాటే అవకాశం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తీవ్రమైన వడగాల్పులపై వాతావరణ శాఖ హెచ్చరిక మన భారత్, ఉమ్మడి ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండగా, రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. తీవ్రమైన ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో నాలుగు...