manabharath.com
Newspaper Banner
Date of Publish : 15 May 2026, 1:56 am Editor : manabharath

కళాశాలలో ఇంటర్ అడ్మిషన్లకు శ్రీకారం..

ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఏసీఈ గ్రూపుల్లో ప్రవేశాలకు ఆహ్వానం – ప్రిన్సిపాల్ తాళ్లపల్లి రాకేష్

మన భారత్, మొగుళ్లపల్లి :
పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినీ, విద్యార్థులకు కొర్కిశాల మోడల్/జూనియర్ కళాశాల శుభవార్త అందించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని కొర్కిశాల గ్రామంలో గల మోడల్ జూనియర్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ తాళ్లపల్లి రాకేష్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మోడల్ కళాశాలలను ఏర్పాటు చేసిందన్నారు. విద్యార్థులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తును ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు.

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ మరియు ఏసీఈ గ్రూపులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతి గ్రూపులో 40 సీట్లు మాత్రమే ఉండటంతో అర్హత కలిగిన విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కళాశాలలో ఇంగ్లీష్ మీడియంలో బోధన నిర్వహించబడుతుందని, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం ద్వారా నాణ్యమైన విద్య అందించబడుతుందని వివరించారు.

విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్స్ అందజేయబడతాయని తెలిపారు. అదేవిధంగా కళాశాలకు రాకపోకల కోసం ఉచిత రవాణా సౌకర్యం కూడా కల్పించబడిందన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారుతుందని పేర్కొన్నారు.

దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభమైందని, చివరి తేదీ మే 25, 2026 వరకు ఉంటుందని వెల్లడించారు. ఎటువంటి దరఖాస్తు ఫీజు లేకుండా విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

TGMS Telangana Admissions Portal

ప్రభుత్వం అందిస్తున్న ఈ విలువైన అవకాశాన్ని ప్రతి విద్యార్థి వినియోగించుకుని ఉన్నత విద్యాభ్యాసానికి బలమైన పునాది వేసుకోవాలని ప్రిన్సిపాల్ తాళ్లపల్లి రాకేష్ పిలుపునిచ్చారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..