విద్యుత్ వైర్లు తెగి అగ్ని ప్రమాదం..
మన భారత్, మొగుళ్లపల్లి రెండెకరాల మొక్కజొన్న పంట దగ్ధం.. సర్పంచ్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పోతుగల్లు గ్రామంలో విద్యుత్ వైర్లు తెగిపడటంతో మొక్కజొన్న పంట చేనులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన నేరెళ్ల సుధాకర్కు చెందిన సుమారు రెండెకరాల మొక్కజొన్న పంట పూర్తిగా అగ్నికి ఆహుతైంది. చేతికొచ్చిన పంట కళ్లముందే కాలిపోతుండటంతో రైతు బోరున విలపించాడు. వేసవి తీవ్రత, వడగాలుల కారణంగా మంటలు వేగంగా వ్యాపించే...