ఈతకు వెళ్లే యువతకు జాగ్రత్తలు..!
మన భారత్, తలమడుగు/తాంసి: ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తాంసి పోలీసులు ఎండాకాలంలో చెరువులు, వాగులు, నదుల వద్ద ఈతకు వెళ్లే యువతకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. “మీ భద్రత మా బాధ్యత” అనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో హస్నాపూర్ గ్రామస్తులు, యువత, తల్లిదండ్రులకు పోలీసులు జాగ్రత్తలు వివరించారు. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో యువత సరదాగా ఈతకు వెళ్లే సమయంలో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు....