బండి భగీరథ్ కేసుపై సీఎం సీరియస్..!
మన భారత్, తెలంగాణ: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన ఆరోపణల కేసు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్గా స్పందించారు. కేసు దర్యాప్తును వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్కు ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 8వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్పై ఒక మైనర్ బాలిక ఫిర్యాదు చేసినట్లు సమాచారం....