పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర సహకారం కోరిన సీఎం
మన భారత్, ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు పూర్తి కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో జరిగిన కీలక సమావేశంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలపై సీఎం విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురవుతున్న సాంకేతిక, ఆర్థిక, పరిపాలనా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కేంద్ర మంత్రిని...