ప్రైవేట్ బడులపై కఠిన చర్యలు..
మన భారత్, ఆదిలాబాద్: జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల పనితీరుపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించి, గుర్తింపు లేని స్కూళ్లను వెంటనే సీజ్ చేయాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. విద్యా శాఖ నిర్వహించిన విద్య వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే విధంగా ఎలాంటి అక్రమాలు జరిగినా సహించబోమని స్పష్టం చేశారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు...