పెన్షన్ మంజూరు చేయాలని ధర్నా..
మన భారత్ ,ధన్వాడ : నారాయణపేట జిల్లా లోని ధన్వాడ మండల కేంద్రంలో బీడీ కార్మికులు తమ దీర్ఘకాలిక డిమాండ్ అయిన పెన్షన్ మంజూరుకు గాను మరోసారి ఆందోళనకు దిగారు. ఎన్నో ఏండ్లుగా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నామని, అయినప్పటికీ తమ సమస్యలను పట్టించుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తూ మంగళవారం ఎంపీడీవో కార్యాలయం ముందు బీడీ కార్మిక ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు సహా పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని...