manabharath.com
Newspaper Banner
Date of Publish : 05 May 2026, 2:45 pm Editor : manabharath

మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు..

మన భారత్ , మొగుళ్ళపల్లి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని చౌరస్తాలో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ సర్పంచ్ బత్తిని శ్రీహరి గౌడ్, టిఆర్ఎస్ మండల నాయకులు రావిశెట్టి రమేష్, చెక్క శ్రీధర్, గుడిమల్ల రమేష్, దేవునూరి కుమారస్వామి, బొల్లేని రవికుమార్, ముడుపు రవీందర్, వార్డు సభ్యులు చిలుకమారి శ్రీనివాస్, అర్షం మహేష్ కుమార్ తదితరులు హాజరయ్యారు. చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి, స్వీట్లను పంపిణీ చేస్తూ వేడుకలను మరింత ఉత్సాహంగా జరిపారు.

ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బత్తిని శ్రీహరి గౌడ్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో గండ్ర వెంకట రమణారెడ్డి కీలక పాత్ర పోషించి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఒప్పించి భూపాలపల్లి నియోజకవర్గానికి భారీగా నిధులు తీసుకువచ్చారని గుర్తుచేశారు. ఆ నిధులతో నియోజకవర్గంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగి, భూపాలపల్లి రాష్ట్రంలోనే అభివృద్ధి ప్రదాతగా నిలిచిందని కొనియాడారు.

అదేవిధంగా, ఆయన నాయకత్వంలో రైతులు, పేదలు, సాధారణ ప్రజలకు ఉపయోగకరమైన పథకాలు అమలు అయ్యాయని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన నాయకుడిగా గండ్ర వెంకట రమణారెడ్డి పేరు సంపాదించారని అన్నారు.

జన్మదినం సందర్భంగా గండ్ర వెంకట రమణారెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు సేవ చేయాలని ఆశీర్వదించారు. ఆయన కుటుంబ సభ్యులకు కూడా దేవుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.

ఈ వేడుకల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా శుభాకాంక్షలు తెలిపారు. మొత్తం మీద మొగుళ్ళపల్లి మండలంలో ఈ జన్మదిన వేడుకలు పండుగ వాతావరణాన్ని తలపించాయి.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..