మన భారత్, న్యూఢిల్లీ:
బెంగాల్, పుదుచ్చేరి, అస్సాంలో ఎన్డీయే సాధించిన విజయాలను భారతీయ జనతా పార్టీ (BJP) గర్వించదగిన ఎన్నికల ఫలితాలుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అభివర్ణించారు. ఈ విజయాలకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తాజాగా మీడియాతో మాట్లాడిన నితిన్ నబీన్, 2014 తర్వాత భాజపా దేశవ్యాప్తంగా గణనీయమైన విజయాలను నమోదు చేస్తోందని అన్నారు. ముఖ్యంగా అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ప్రజలు తమ పాలనను తిరిగి అంగీకరించడం ఎన్డీయే ప్రభుత్వంపై ఉన్న విశ్వాసాన్ని సూచిస్తోందని పేర్కొన్నారు.
ఈ ఎన్నికల ఫలితాలు భాజపా విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల మద్దతును ప్రతిబింబిస్తున్నాయని ఆయన తెలిపారు. పార్టీ శక్తి దేశవ్యాప్తంగా విస్తరిస్తోందని, భవిష్యత్తులో దక్షిణ భారత రాష్ట్రాల్లో కూడా భాజపా మరిన్ని విజయాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశ రాజకీయాల్లో భాజపా మరింత బలపడుతోందని, ఎన్డీయే కూటమి విజయాలు అభివృద్ధి, స్థిరత్వానికి ప్రజలు ఇచ్చిన మద్దతుగా భావించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
