manabharath.com
Newspaper Banner
Date of Publish : 03 May 2026, 10:09 am Editor : manabharath

గోపీచంద్ కొత్త చిత్రంలో అనార్కలి ఎంట్రీ

మన భారత్ ,సినీ విభాగం:

టాలీవుడ్‌లోకి మరో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతోంది. యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ తాజా చిత్రంలో హీరోయిన్‌గా కేరళకు చెందిన అనార్కలి ఎంపికైనట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సినిమా ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుండటం విశేషం.

అనార్కలి 1999లో కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లాలో జన్మించారు. చిన్నప్పటి నుంచే గ్లామర్ రంగంపై ఆసక్తి పెంచుకున్న ఆమె, కాలేజీ చదువుతున్న సమయంలోనే మోడలింగ్ రంగంలో అడుగుపెట్టారు. తక్కువ సమయంలోనే పలు ఫ్యాషన్ షోలు, టీవీ ప్రకటనల్లో మెరిసి గుర్తింపు పొందారు.

సినీరంగంలోకి ఆమె అడుగు 2021లో విడుదలైన మోహన్ కుమార్ ఫ్యాన్స్ చిత్రంతో పడింది. ఆ తర్వాత మలయాళంతో పాటు తమిళ చిత్రాల్లో కూడా నటించి తన ప్రతిభను చాటుకున్నారు. అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

ఇటీవల ప్రేమలు చిత్ర హీరో నస్లెన్ తో అనార్కలి రిలేషన్‌లో ఉన్నారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేదు.

ఇప్పటికే పలు భాషల్లో తన ప్రతిభను నిరూపించుకున్న ఈ కేరళ బ్యూటీ, గోపీచంద్ చిత్రంతో టాలీవుడ్‌లో ఎలా మెప్పిస్తుందో చూడాలి. కొత్త కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని సమాచారం.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..