manabharath.com
Newspaper Banner
Date of Publish : 03 May 2026, 8:54 am Editor : manabharath

క్విజ్ పోటీల్లో విజేతలకు బహుమతులు..

మన భారత్, ఆదిలాబాద్: 

శ్రీ మురళీకృష్ణ ఆలయంలో ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. ప్రత్యేక పూజలు, భజనలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహించి భక్తులు పాల్గొన్నారు.

వేడుకలలో భాగంగా ఏర్పాటు చేసిన క్విజ్ పోటీలు ఆకట్టుకున్నాయి. వివిధ గ్రామాల నుంచి పాల్గొన్న సత్సంగ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీల్లో మాండగడ సుందర సత్సంగం సభ్యులు మొదటి బహుమతిని గెలుచుకోగా, పిప్పర్ వాడ సత్సంగం ద్వితీయ స్థానం, పార్డి సత్సంగం తృతీయ స్థానం, వాగపూర్ సుందర సత్సంగం సభ్యులు నాల్గవ బహుమతిని సాధించారు. విజేతలకు కార్యక్రమ నిర్వాహకులు బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమానికి సర్పంచ్ తలార్ల భూమన్న ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, ఇలాంటి ఆధ్యాత్మిక మరియు జ్ఞాన సంబంధిత కార్యక్రమాలు యువతలో సాంస్కృతిక విలువలను పెంపొందిస్తాయని అన్నారు. మాజీ వైస్ ఎంపీపీ ముచ్చ రేఖ రఘు కూడా పాల్గొని నిర్వాహకులను అభినందించారు.

సుందర సత్సంగం అధ్యక్షుడు మలపతి సుభాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజేశ్వర్, పోతన్న, విలాస్, మహేందర్, ఆనంద్, సురేందర్ తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

ఈ వార్షికోత్సవం గ్రామస్థుల ఐక్యతను ప్రతిబింబిస్తూ, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించే వేదికగా నిలిచింది.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..