ఆకుకూరల సాగుతో లాభాల బాట.!
మన భారత్, తలమడుగు:,: తలమడుగు మండలంలోని దేవాపూర్, కుచాలాపూర్ గ్రామాల రైతులు ఆకుకూరల సాగుతో మంచి లాభాలు పొందుతూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తక్కువ ఖర్చుతో తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం వచ్చే పంటలపై దృష్టి సారించిన రైతులు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు. ప్రధానంగా తోటకూర, పాలకూర, మెంతి వంటి ఆకుకూరలను ఉద్యాన శాఖ సహకారంతో సాగు చేస్తున్నారు. ఈ పంటలు కేవలం 30 నుంచి 35 రోజుల్లోనే దిగుబడికి వస్తుండటంతో రైతులకు వేగంగా ఆదాయం...