పింఛన్ డబ్బులు ఇవ్వాలని రాస్తారోకో.!
మన భారత్, ధన్వాడ: పింఛన్ డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధన్వాడలో చేయూత పింఛన్ లబ్ధిదారులు రాస్తారోకో నిర్వహించారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో కొంతసేపు రాకపోకలు స్తంభించాయి. ఇటీవల పింఛన్ డబ్బులు ఇవ్వడంలో ఆలస్యం జరుగుతుండటంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో డబ్బులు అందిస్తామని పోస్ట్ అధికారులు హామీ ఇచ్చిన నేపథ్యంలో గురువారం ఉదయం నుంచే లబ్ధిదారులు పోస్ట్ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. గంటల తరబడి...