manabharath.com
Newspaper Banner
Date of Publish : 30 April 2026, 12:37 am Editor : manabharath

మెరిసిన గురుకుల పాఠశాల విద్యార్థినులు..

 మన భారత్ ,ఆదిలాబాద్ :

తాంసి మండలంలోని బండల్ నాగపూర్ ఎంయాజేపీ గురుకుల పాఠశాల విద్యార్థినులు 10వ తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ ఏడాది పరీక్షల్లో పాఠశాల 100 శాతం ఫలితాలను సాధించి మరోసారి తన ప్రతిష్ఠను చాటుకుంది.

మండల స్థాయిలో టాపర్లుగా నిలిచిన విద్యార్థినుల్లో వర్శిని 579/600 మార్కులతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా, భవజ్ఞ మరియు లావణ్య తలో 576/600 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచారు. వీరి ప్రతిభపై విద్యా వర్గాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

విద్యార్థినుల విజయం పట్ల పాఠశాల ప్రిన్సిపాల్ అసుమతి, ఉపాధ్యాయ బృందం ఆనందం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ, నాణ్యమైన బోధన, విద్యార్థుల కృషి ఫలితంగానే ఈ విజయాలు సాధ్యమయ్యాయని వారు తెలిపారు. భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించాలని విద్యార్థినులను ప్రోత్సహించారు.

విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు సాధించిన ఫలితాలపై గర్వం వ్యక్తం చేస్తూ, పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయంతో తాంసి మండలానికి మంచి గుర్తింపు లభించిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.


మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..