మన భారత్, గుజరాత్:
గుజరాత్ రాష్ట్రంలోని Surat నగరంలో పట్టపగలే జరిగిన బ్యాంకు దోపిడి ఘటన సంచలనం సృష్టించింది. వరాచా ప్రాంతంలో ఉన్న State Bank of India (SBI) శాఖలో దుండగులు తుపాకులతో బెదిరించి సుమారు రూ.50 లక్షల నగదును అపహరించారు.
సమాచారం ప్రకారం, ముందుగా దుండగులు బ్యాంకులోని అలారం వ్యవస్థను నిర్వీర్యం చేశారు. అనంతరం బ్యాంకు సిబ్బందిని తుపాకులతో బెదిరించి, వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని దోపిడీకి పాల్పడ్డారు. కొద్ది నిమిషాల్లోనే నగదు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ ఘటనతో బ్యాంకులో తీవ్ర కలకలం రేగగా, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పట్టపగలే జరిగిన ఈ దోపిడి స్థానికంగా భయాందోళనలకు దారితీసింది. నగరంలో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
