మంచి నీళ్లు ఇవ్వండి మహాప్రభో.!
మన భారత్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. భాగ్యనగర్ కాలనీలో గత నెల రోజులుగా తాగడానికి సరిపడా నీరు అందకపోవడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. తాగునీరు కోసం ఎన్నిసార్లు అధికారులను, ప్రజాప్రతినిధులను సంప్రదించినా స్పందన లేకపోవడంతో కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ కాలనీ వాసులు ఖాళీ బిందెలతో దంతాలపల్లి రహదారిపైకి వచ్చి నిరసన తెలిపారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి...