manabharath.com
Newspaper Banner
Date of Publish : 28 April 2026, 9:15 am Editor : manabharath

బార్ అసోసియేషన్ అధ్యక్షుడికి ఘన సన్మానం..

మన భారత్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంద్రాల నగేష్ ఐదవ సారి ఎన్నిక కావడం సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. స్థానికంగా ఉన్న ఆయన కార్యాలయంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జిల్లా ఉపాధ్యక్షులు కోటగిరి రాకేష్, బోండ్ల వెంకటస్వామి శాలువాతో నగేష్ గారిని సత్కరించి అభినందనలు తెలిపారు.

ఎంద్రాల నగేష్ వరుసగా ఐదోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఆయనపై న్యాయవాదుల విశ్వాసానికి నిదర్శనమని వారు పేర్కొన్నారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారం, బార్ అసోసియేషన్ అభివృద్ధికి ఆయన చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు.

ఈ సందర్భంగా ఎంద్రాల నగేష్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి మరోసారి బాధ్యతలు అప్పగించిన సహచర న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. బార్ అసోసియేషన్ అభివృద్ధి, న్యాయవాదుల సంక్షేమం కోసం మరింత కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, బీజేపీ నాయకులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.