తిరుమలలో భక్తుల రద్దీ… సర్వదర్శనానికి 18 గంటలు
మన భారత్ ,తిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. వారాంతం సందర్భంగా ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తుండటంతో దర్శనానికి ఎక్కువ సమయం పడుతోంది. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనం పొందేందుకు సుమారు 18 గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్ పూర్తిగా నిండిపోయి, బయట కూడా భక్తులు పెద్ద ఎత్తున వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. శనివారం ఒక్కరోజే సుమారు 80,350 మంది భక్తులు శ్రీవారిని...