కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ..
మన భారత్ | మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండల కేంద్రంలో సంక్షేమం మరియు వ్యవసాయ రంగానికి సంబంధించిన కీలక కార్యక్రమాలు నిర్వహించారు. రైతు వేదిక భవనంలో మండలానికి చెందిన 61 మంది లబ్ధిదారులకు రూ. 61,07,076 విలువైన కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ కళ్యాణ లక్ష్మి వంటి పథకాల ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు....