manabharath.com
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 8:39 am Editor : manabharath

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ..

మన భారత్, మొగుళ్లపల్లి:

మొగుళ్లపల్లి మండలంలోని పాత ఇస్సిపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు, అరటి పండ్లు పంపిణీ చేసిన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పెనుకుల గట్టన్న, ఉపసర్పంచ్ నేర్పాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం ఈ కార్యక్రమం జరిగింది.

వేసవి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఎండలో కష్టపడుతున్న కూలీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పంపిణీ చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే పనులు నిర్వహిస్తూ, మిగతా సమయాల్లో ఎండ తీవ్రతకు దూరంగా ఉండాలని కూలీలకు సూచించారు. ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారి జీవనోపాధికి తోడ్పడుతోందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ పెనుకుల గట్టన్న మాట్లాడుతూ, కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం గ్రామాల్లోని నిరుపేద కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా మారిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ కార్యదర్శి శ్రీనివాస్, కారోబార్ మొగిలి, ఫీల్డ్ అసిస్టెంట్ అశోక్‌తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కూలీలు ఈ చర్యపై సంతోషం వ్యక్తం చేశారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..