ఆపరేషన్ చేస్తుండగా వైద్యుడికి గుండెపోటు..
మన భారత్, నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన ప్రముఖ వైద్యుడు డా. సురేందర్ గుండెపోటుతో మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సేవాభావంతో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న సమయంలోనే ఆయన ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. డా. సురేందర్ నర్సాపూర్ (జి) ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తూ, భైంసా పట్టణంలో ప్రైవేట్ ఆసుపత్రిని కూడా నిర్వహిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం తన ప్రైవేట్ ఆసుపత్రిలో ఓ రోగికి శస్త్రచికిత్స నిర్వహిస్తుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు....