రైతులకు ఊరట – మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
మన భారత్, తాంసి: రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని బోథ్ ఎమ్మెల్యే Anil Jadhav తెలిపారు. తాంసి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో తెలంగాణ రాష్ట్ర మార్కుఫెడ్ ఆధ్వర్యంలో, పీఏసీఎస్ తాంసి ద్వారా ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రైతులను అభినందిస్తూ, మొక్కజొన్న రైతును సన్మానించారు. రైతుల కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం తగిన మద్దతు అందిస్తున్నదని...