ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయాలు..
మన భారత్, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైన ఘటన కలకలం రేపింది. కోతి రాంపూర్ బైపాస్ వద్ద అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమవగా, పలువురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం కారణంగా కొంతసేపు...