రాష్ట్రవ్యాప్తంగా మహా ధర్నాలకు పిలుపు
మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) కార్మికుల సమ్మె మరింత ఉధృతం కానుంది. ఈ నేపథ్యంలో రేపటి సమ్మె కార్యాచరణను ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల ఎదుట ఉదయం 5 గంటల నుంచే మహా ధర్నాలు నిర్వహించాలని జేఏసీ పిలుపునిచ్చింది. సమ్మె మొదటి రోజున కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినందుకు జేఏసీ నాయకత్వం ధన్యవాదాలు తెలిపింది. కార్మికుల ఐక్యతే...