ఆర్టీసీ సమ్మె ప్రభావం.. ప్రయాణికుల ఇబ్బందులు
మన భారత్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులు అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పట్టడంతో రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. సమ్మె ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమవగా, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచే బస్టాండ్ల వద్ద ప్రయాణికులు పడిగాపులు కాచడం కనిపించింది. హైదరాబాద్ నగరంలోని ప్రధాన బస్టాండ్లలో ప్రభుత్వం అద్దె బస్సులను నడిపిస్తూ పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఆర్టీసీ జేఏసీ అడ్డంకులు కలగకుండా ప్రధాన బస్టాండ్ల వద్ద...