ప్రజల రక్షణనే పోలీసుల కర్తవ్యం..
మన భారత్, మొగుళ్ళపల్లి: ప్రజల భద్రత కోసం రాత్రింబవళ్లు విధులు నిర్వర్తిస్తూ, అవసరమైతే ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేసేది పోలీస్ వ్యవస్థేనని భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం వార్షిక తనిఖీల్లో భాగంగా మొగుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ను సందర్శించిన ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణలో సైనికులు ఎంత ముఖ్యమో, గ్రామాలు మరియు పట్టణాల్లో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు అంతే కీలకమని అన్నారు....