అంగన్వాడీ టీచర్లకు 5G ఫోన్ల పంపిణీ..
మన భారత్, ఆదిలాబాద్ : నెరడిగొండ మండల కేంద్రంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు కింద అంగన్వాడీ సిబ్బందికి 5G మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నియోజకవర్గంలోని బోథ్, సోనాల, ఇచ్చొడ, నెరడిగొండ, బజార్ హత్నూర్, సిరికొండ మండలాలకు చెందిన మొత్తం 289 మంది అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు ఫోన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బందికి సాంకేతిక సౌకర్యాలు కల్పించడం మంచిదేనని, అయితే...