manabharath.com
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 2:04 pm Editor : manabharath

వడదెబ్బ తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి..

మన భారత్, తలమడుగు:
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులు మరియు వడదెబ్బపై అవగాహన కల్పించేందుకు మెడికల్ క్యాంపు నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వైద్య సిబ్బంది వేసవి కాలంలో సంభవించే వ్యాధులు, వడదెబ్బ లక్షణాలు, నివారణ చర్యలపై ప్రజలకు వివరించారు. అధిక ఉష్ణోగ్రతల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తాగునీరు ఎక్కువగా తీసుకోవడం, ఎండలో అవసరం లేకుండా బయటకు వెళ్లకపోవడం వంటి సూచనలు చేశారు. పిల్లలు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉడుగు రాకేష్, ఉప సర్పంచ్ కొమ్ము వెంకటేష్, వార్డ్ సభ్యులు, సిహెచ్ఓ చిన్నన్న, సూపర్వైజర్ లీల, హెల్త్ అసిస్టెంట్ అనిల్, ఏఎన్ఎం సుజాత, ఆశా వర్కర్లు మమత, కవిత, గ్రామ కార్యదర్శి రాములు తదితరులు పాల్గొన్నారు.

ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఇటువంటి అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. గ్రామస్థులు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..