manabharath.com
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 1:50 pm Editor : manabharath

ఎమ్మెల్యే పర్యటన విజయవంతం చేయాలి..

మన భారత్, ఆదిలాబాద్ జిల్లా:

తాంసీ మండల కేంద్రంలో బుధవారం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించనున్న నేపథ్యంలో ప్రజలకు ఆహ్వానం పలికారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చేతుల మీదుగా ఉదయం 9:30 గంటలకు సబ్ మార్కెట్ యార్డ్‌లో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.

ఈ కార్యక్రమం ద్వారా రైతులకు మద్దతు ధరతో పంట కొనుగోలు చేయడం ప్రారంభమవుతుందని, స్థానిక రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు సూచించారు. రైతులకు నేరుగా లాభం చేకూరే విధంగా కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతుందని తెలిపారు.

అలాగే ఉదయం 10:00 గంటలకు ఐకేపీ భవనంలో కళ్యాణ లక్ష్మి పథకం కింద చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు ప్రభుత్వ సహాయం అందజేయనున్నారు.

ఈ సందర్భంగా రైతులు, లబ్ధిదారులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకులు, మాజీ సర్పంచ్ కృష్ణ రత్న ప్రకాష్ కోరారు. ఈ కార్యక్రమాలు మండల ప్రజలకు ఉపయోగకరంగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..