మన భారత్, ఆంధ్ర ప్రదేశ్:
తిరుపతి నగరంలో 80 ఏళ్ల వృద్ధురాలిపై దాడి చేసి లైంగిక దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. తాతయ్య గుంట సమీపంలోని మల్లంగుంట ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది.
సమాచారం ప్రకారం, వృద్ధురాలు తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దుండగులు ఇంట్లోకి చొరబడి ఆమెపై దాడి చేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఘటన అనంతరం గాయాలతో బాధపడుతున్న వృద్ధురాలిని కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఈస్ట్ పోలీసులు, క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈస్ట్ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది.
ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. మహిళల భద్రతపై మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు పోలీసులను కోరుతున్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
