ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ విస్తరణపై ఆందోళన..!
మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్లో ప్రతిపాదిత ఎయిర్పోర్ట్ విస్తరణపై స్థానికుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రారంభంగా సివిల్ ఏవియేషన్ అవసరాలకు సుమారు 819 ఎకరాలు సరిపోతాయని భావించినప్పటికీ, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ప్రతిపాదన చేరడంతో భూమి అవసరం దాదాపు 1500 ఎకరాలకు పెరిగినట్లు సమాచారం. ఈ విస్తరణ ప్రతిపాదన నేపథ్యంలో సోనార్ గల్లి, ఖానాపూర్, శాంతినగర్, ఇందిరమ్మ కాలనీ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ ఇళ్లు, ఆస్తులు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటాయోనని స్థానికులు కంటిమీద కునుకు...