ఉపాధి పనులను పరిశీలించిన డీఆర్డీవో పీడీ
మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలో ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) అమలు తీరు పై డిఆర్డీఓ పీడీ రవీందర్ రాథోడ్ సమగ్రంగా పరిశీలించారు. మండలంలోని ఖోడద్ గ్రామంలో పర్యటించిన ఆయన, ఉపాధి హామీ కూలీలతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వేతనాల వివరాలను తెలుసుకున్నారు. కూలీల సమస్యలు, పనుల అమలు విధానం పై సమాచారం సేకరించి అవసరమైన సూచనలు చేశారు. అనంతరం సాయి లింగి, రూయ్యడి గ్రామాలను సందర్శించిన రవీందర్ రాథోడ్, గ్రామాల్లో జరుగుతున్న ఈజీఎస్...