manabharath.com
Newspaper Banner
Date of Publish : 19 April 2026, 5:05 am Editor : manabharath

ఉపాధి పనులను పరిశీలించిన డీఆర్డీవో పీడీ

మన భారత్, తలమడుగు:

తలమడుగు మండలంలో ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) అమలు తీరు పై డిఆర్డీఓ పీడీ రవీందర్ రాథోడ్ సమగ్రంగా పరిశీలించారు. మండలంలోని ఖోడద్ గ్రామంలో పర్యటించిన ఆయన, ఉపాధి హామీ కూలీలతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వేతనాల వివరాలను తెలుసుకున్నారు. కూలీల సమస్యలు, పనుల అమలు విధానం పై సమాచారం సేకరించి అవసరమైన సూచనలు చేశారు.

అనంతరం సాయి లింగి, రూయ్యడి గ్రామాలను సందర్శించిన రవీందర్ రాథోడ్, గ్రామాల్లో జరుగుతున్న ఈజీఎస్ పనుల ప్రదేశాలను తనిఖీ చేశారు. పనుల నాణ్యత, పురోగతిని సమీక్షిస్తూ, ఎన్ఎంఎంఎస్ (NMMS) సిబ్బంది హాజరు నమోదు విధానాన్ని పరిశీలించారు. పనుల్లో పారదర్శకత, సమర్థత ఉండేలా క్షేత్ర స్థాయి సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మరింత మంది కార్మికులను ఉపాధి హామీ పనుల్లో భాగస్వామ్యం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంపొందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు.

ఈ పర్యటనలో మండల ఉపాధి హామీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ద్వారా పనుల అమలులో పారదర్శకత, క్రమబద్ధత పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..