కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి..
మన భారత్, తలమడుగు: బోథ్ నియోజకవర్గంలోని రైతులకు ఉపశమనం కలిగించేలా జొన్న మరియు మక్కల కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని గౌరవ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మార్క్ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ను కోరారు. ఈ మేరకు హైదరాబాద్లోని కార్యాలయంలో ముధోల్ ఎమ్మెల్యేతో కలిసి మర్యాదపూర్వకంగా కలసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, రైతులు పండించిన పంటలకు సరైన ధర లభించాలంటే ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం అవసరమని తెలిపారు....