మన భారత్, తలమడుగు:
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ గ్రామంలో అగ్నిప్రమాదంతో జొన్న పంట కాలిపోవడంతో బాధిత రైతును స్థానిక నాయకులు పరామర్శించారు. మాజీ ఎంపీటీసీ మోర్గు ఆశన్న పంటచేనులో జరిగిన ఈ ఘటనతో రైతుకు భారీ నష్టం సంభవించినట్లు సమాచారం.
ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసిలు గోక గణేష్ రెడ్డి, బొల్లారపు బాబన్న, ఉపసర్పంచ్ శ్రీరామ్ తదితరులు సంఘటనా స్థలాన్ని సందర్శించి ఆశన్నను ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున తగిన పరిహారం అందించాలని వారు కోరారు.
అదే విధంగా దేవాపూర్ గ్రామానికి చెందిన అజీజ్ పటేల్ కుటుంబంలో విషాదం చోటుచేసుకోవడంతో, ఆయన మేనల్లుడు మరణించిన నేపథ్యంలో నాయకులు ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో నాయకులు కే ప్రతాప్, రాజారెడ్డి, పాట్నా నరసయ్య, వెంకన్న యాదవ్, సలీం, ఆశకాలి, లచ్చన్న, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
