మన భారత్, ఉట్నూర్:
ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాలను మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు ఘనంగా ఆవిష్కరించారు. కార్యక్రమం పట్ల గ్రామాల ప్రజల్లో ఆసక్తి పెరుగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఏప్రిల్ 24, 2026న సాయంత్రం 5 గంటలకు బైరంకొండలో హిందూ సమ్మేళనం జరగనుంది. ఈ సమ్మేళనంలో ప్రాంతీయ స్థాయిలో హిందూ సమాజ ఐక్యత, సంస్కృతి పరిరక్షణ, సామాజిక అంశాలపై చర్చలు జరగనున్నాయి.
ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళన కమిటీ అధ్యక్షులు ఎడివెళ్లి నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలరాజు, కోశాధికారి గణపతి శ్రీనివాస్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ సమ్మేళనం విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
గ్రామ సర్పంచులు, స్థానిక నాయకులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఈ సమ్మేళనం ద్వారా సామాజిక ఐక్యత మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాజకీయ నాయకులకు శుభవార్త..
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
