manabharath.com
Newspaper Banner
Date of Publish : 16 April 2026, 1:28 pm Editor : manabharath

ఉద్యమంతోనే సమస్యల పరిష్కారం..

మన భారత్, నారాయణపేట :

పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటే ప్రభుత్వంపై బలంగా ప్రతిఘటన చేయాల్సిందేనని టీజీఈ జేఏసీ నాయకులు పేర్కొన్నారు. నారాయణపేటలో గురువారం నిర్వహించిన సమావేశంలో తపస్ జిల్లా అధ్యక్షుడు నరసింహ మాట్లాడుతూ, ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నాటికి పీఆర్సీ (PRC) ప్రకటించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దశలవారీగా చేపట్టనున్న ఉద్యమానికి ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయుడు చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు.

ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 17న మండల కేంద్రాల్లోని తహసిల్దార్లకు వినతిపత్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేయాలని కోరారు.

ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో ఆందోళనలు మరింత ఉధృతం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని నాయకులు స్పష్టం చేశారు.

రాజకీయ నాయకులకు శుభవార్త..!

https://manabharath.com/7179/

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..