వడదెబ్బకు జాగ్రత్తలు తప్పనిసరి.!
తలమడుగు, మన భారత్: ఆదిలాబాద్ జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో తలమడుగు మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు డా. హరీష్ సూచించారు. “మన భారత్”కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వేసవికాలంలో పాటించాల్సిన జాగ్రత్తలు, వడదెబ్బ లక్షణాలు, నివారణ చర్యలను వివరించారు. ప్రస్తుతం జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో రైతులు, కూలీలు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపే పనులు పూర్తి చేసుకుని...