మన భారత్, తెలంగాణ (జగిత్యాల):
మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరాలనుకోవడం సరైన నిర్ణయం కాదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం తొందరపాటుతో తీసుకున్నదిగా కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. జీవన్ రెడ్డి వ్యక్తిత్వంపై తనకు గౌరవం ఉన్నప్పటికీ, రాజకీయంగా తీసుకుంటున్న ఈ అడుగు సరైన దిశలో లేదని అన్నారు.
గురువారం జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో జరిగిన కార్యక్రమంలో బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి నిశాంత్ కార్తికేయ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ ఆయనకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అరవింద్ పలు రాజకీయ అంశాలపై స్పందించారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్పై కూడా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. సంజయ్ ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తారని అన్నారు. ఓట్ల కోసం ఒక పార్టీ పేరుతో, అభివృద్ధి పేరుతో మరో పార్టీ అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. తిరిగి బీఆర్ఎస్లో చేరినా ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానించారు.
సంజయ్ ప్రస్తుతం అసంతృప్తితో ఉండి అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని అరవింద్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వం కోల్పోతుందనీ, ఆ పార్టీకి స్పష్టమైన విధి విధానాలు లేకపోవడం వల్ల ప్రజల్లో విశ్వాసం తగ్గిందని ఎద్దేవా చేశారు.
ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తుండగా, రాబోయే రోజుల్లో మరిన్ని రాజకీయ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
రాజకీయ నాయకులకు శుభవార్త..!
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
