అంగన్వాడీ టీచర్ ను చెట్టుకు కట్టేసి..
మన భారత్, సంగారెడ్డి : జిల్లాలో జరిగిన ఒక ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దామరగిద్ద గ్రామంలో అంగన్వాడీ టీచర్ను గ్రామస్తులు చెట్టుకు కట్టి అవమానించిన సంఘటన తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. వివరాల్లోకి వెళ్తే, గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ వసంత కుమారి భర్త ప్రభాకర్ ‘హెచ్బీఎం ఫైనాన్స్’ పేరుతో గ్రామంలోని పలువురి వద్ద నుంచి డబ్బులు సేకరించి పరారైనట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో డబ్బులు కోల్పోయిన గ్రామస్తులు ఆగ్రహానికి లోనై, టీచర్పై కోపాన్ని ప్రదర్శించినట్లు సమాచారం....