ప్రమాదకరంగా లో లేవల్ వంతెన..
మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో ఉన్న లో లెవెల్ వంతెన రహదారి తీవ్రంగా దెబ్బతిని ప్రమాదకరంగా మారింది. వంతెనపై ఉన్న ఇనుప రాడ్లు బయటకు కనిపించడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు రోజువారీ ప్రయాణాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వంతెన ద్వారా తలమడుగు–ఆదిలాబాద్ మధ్య నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే రహదారి దెబ్బతినడం వల్ల ప్రయాణం ప్రమాదకరంగా మారింది. బయటకు వచ్చిన...