manabharath.com
Newspaper Banner
Date of Publish : 07 April 2026, 3:51 am Editor : manabharath

భారీ వర్షాలు.. 110 మంది మృతి 

ఇంటర్ నేషనల్ డెస్క్, మన భారత్:

అఫ్గానిస్థాన్‌లో గత రెండు వారాలుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. దేశంలోని పలు ప్రాంతాల్లో వరదలతో భారీ నష్టం సంభవించగా, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తాలిబన్ అధికారుల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు కనీసం 110 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 160 మంది గాయపడ్డారు. వరదల కారణంగా 950కు పైగా గృహాలు పూర్తిగా ధ్వంసమవగా, 4,155 ఇళ్లు స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలిపారు.

వేలాది కుటుంబాలు నివాసాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. బాధితులకు తాత్కాలిక నివాసాలు, ఆహారం, వైద్య సదుపాయాలు అందించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఇంకా పలు ప్రాంతాల్లో పరిస్థితి అదుపులోకి రాలేదని అధికారులు పేర్కొన్నారు.

వరదల వల్ల వ్యవసాయ భూములు కూడా దెబ్బతినడంతో ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. అంతర్జాతీయ సహాయం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

రాజకీయ నాయకులకు శుభవార్త..!

https://manabharath.com/7179/

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..