బాధిత కుటుంబాలకు పరామార్శ..
మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో రైతు విమోచన కమిషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వరరావు (నవత వెంకన్న) సోమవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి, వారికి ఓదార్పునిచ్చారు. ముల్కలపల్లి గ్రామానికి చెందిన ఓనపాకల బిక్షపతి, పసునూటి ఓదెలు, చింతలపల్లి గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ కుమ్మరి సారయ్యలు అనారోగ్యంతో మరణించగా,...