మన భారత్ ,ధన్వాడ:
మండల కేంద్రమైన ధన్వాడలో ఆదివారం అంబేద్కర్ సంఘ ఆధ్వర్యంలో మహానేత బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు, ముఖ్యంగా సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆలోచనలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో భాగంగా మిఠాయిలను పంపిణీ చేసి, ప్రజల్లో సంతోషాన్ని పంచుకున్నారు. ఈ వేడుకల్లో స్థానిక ప్రజలు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతి రామచంద్రయ్య, ఉపసర్పంచ్ పూజారి నర్సింలు, అంబేద్కర్ సంఘం నాయకులు రాజన్న, జడల బాలరాజు, గుర్రం రాజు, కోతి కిష్టయ్య, మల్లయ్య, గోవర్ధన్ గౌడ్, సత్యనారాయణ గౌడ్, రాఘవేందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, సురేంద్ర గౌడ్, కురువ నవీన్, రహిమాన్ ఖాన్, హుస్సేన్, ఉషనయ్య, రిటైర్డ్ ఉపాధ్యాయులు బాలకృష్ణయ్య, గుంజనూరు మల్లేష్, ప్రధానోపాధ్యాయులు నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
రాజకీయ నాయకులకు శుభవార్త..!
మీరు స్థానిక వార్తలు పోస్ట్ చేయడానికి క్రింది వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
