మన భారత్, ఆంధ్ర ప్రదేశ్:
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టీ క్రమశిక్షణ అంశం మరోసారి హాట్టాపిక్గా మారింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ ఎమ్మెల్యేలకు స్పష్టమైన సందేశం ఇస్తూ, క్రమశిక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని కఠినంగా హెచ్చరించారు.
ఇటీవల నరసారావుపేట ఎమ్మెల్యే డాక్టర్ అరవింద బాబు వ్యవహారం నేపథ్యంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తనకు కావాల్సిన వ్యక్తికి పదవి ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా మారినట్లు భావించిన అధిష్టానం, దీనిపై తీవ్రంగా స్పందించింది.
ఈ క్రమంలోనే చంద్రబాబు మాట్లాడుతూ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ పేరును ఉపయోగించుకోవడం లేదా ప్రభుత్వ నిర్ణయాలను బహిరంగంగా విమర్శించడం సహించబోమని తేల్చి చెప్పారు. పార్టీ ఇమేజ్కు నష్టం కలిగించే చర్యలకు పాల్పడితే, ఎంతటి నాయకుడైనా సస్పెన్షన్ సహా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ప్రభుత్వం , పార్టీకి చెడ్డపేరు తెచ్చే విధంగా ప్రవర్తిస్తే చర్యలు అనివార్యమని హెచ్చరించిన సీఎం, అన్ని నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. రాబోయే రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, పార్టీ క్రమశిక్షణను మరింత బలోపేతం చేయాలన్న సంకల్పాన్ని ఆయన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఈ వ్యాఖ్యలతో పార్టీ అంతర్గత వ్యవహారాల్లో కట్టుదిట్టమైన నియంత్రణ అమలు కానున్నట్లు సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
రాజకీయ నాయకులకు శుభవార్త..!
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి
