పిప్రిలో సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన..
మన భారత్, బజార్ హత్నూర్: ఈనెల 6వ తేదీన బజార్ హత్నూర్ మండలంలోని పిప్రి గ్రామంలో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ ఏర్పాట్లను జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరిశీలించారు. సభా స్థలంలో జరుగుతున్న పనులను సవివరంగా పరిశీలించి, అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, ప్రాంత అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా పనిచేయడం తమ లక్ష్యమని స్పష్టం చేశారు....